కొండా సురేఖ వ్యాఖ్యలపై కోర్టుకెళ్లిన నాగార్జున.. క్రిమినల్ చర్యలు తీసుకోవాలని పిటిషన్

by Gantepaka Srikanth |
కొండా సురేఖ వ్యాఖ్యలపై కోర్టుకెళ్లిన నాగార్జున.. క్రిమినల్ చర్యలు తీసుకోవాలని పిటిషన్
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ మంత్రి కొండా సురేఖ(Minister Konda Surekha) వ్యాఖ్యలపై ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున(Akkineni Nagarjuna) కోర్టును ఆశ్రయించారు. గురువారం హైదరాబాద్‌లోని నాంపల్లి కోర్టులో నాంపల్లి కోర్టులో పరువునష్టం దావా వేశారు. తన కుటుంబ పరువుకు భంగం కలిగించారని పిటిషన్‌‌లో పేర్కొన్నారు. మంత్రి కొండా సురేఖపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాగా, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను(KTR)విమర్శించే క్రమంలో సమంత, నాగచైతన్య, నాగార్జున (Nagarjuna) పేర్లను మంత్రి కొండా సురేఖ ప్రస్తావించారు. వారి వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడారు. ఆ మాటలు వైరల్‌గా మారాయి. దీనిపై అక్కినేని కుటుంబం, సమంతతో సహా సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు స్పందించారు. కొండా సురేఖ క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఈ నేపథ్యంలో తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్లు మంత్రి తెలిపారు. ఈ క్రమంలో నాగార్జున కోర్టును ఆశ్రయించడం సర్వత్రా ఆసక్తిగా మారింది.

Next Story

Most Viewed